>

కొత్త ఆలోచనలతో ప్రేరణ, అనుభవంతో మార్గనిర్దేశం
మా బోర్డులో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు, వీరు వివిధ పరిశ్రమలలో తమకి ఉన్న విస్తృత అనుభవం మరియు అవగాహనతో మేము మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతారు.
శ్రీ సుదర్శన్ వేణు U.S లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో జెరోమ్ ఫిషర్ ప్రోగ్రామ్లో హానర్స్ పట్టా పొందారు. ఈయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా మరియు వార్టన్ స్కూల్ నుండి ఎకనామిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టాను అందుకున్నారు. ఇంకా, యునైటెడ్ కింగ్డమ్ లోని వార్విక్ విశ్వవిద్యాలయం యొక్క విభాగం అయిన వార్విక్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ నుండి ఇంటర్నేషనల్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన మాస్టర్స్ ప్రోగ్రామ్ సమయంలో, శ్రీ సుదర్శన్ వేణు టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్లో అనుభవాన్ని పొందారు. టివిఎస్ మోటార్ కార్యకలాపాలను ఆఫ్రికా, ఆసియన్ మరియు లాటిన్ అమెరికా దేశాలలో విస్తరించడానికి ఈయన కీలకంగా వ్యవహరించారు. శ్రీ సుదర్శన్ వేణు ఒక ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ ఇండియా ద్వారా జెన్నెక్స్ట్ లీడర్ ఆఫ్ ఇండియా ఇంక్గా గుర్తించబడ్డారు. ఈయన ప్రస్తుతం టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మరియు టివిఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు.
రిటైల్ ఆస్తులు, ఇన్సూరెన్స్, కార్డులు మరియు సంపద నిర్వహణ లాంటి వివిధ ఆర్థిక ప్రోడక్ట్లలో 26 ఏళ్లకు పైగా వృత్తిపరమైన అనుభవం ఉన్న మా సిఇఒ, ఆషిష్ సప్రా టీవీఎస్ క్రెడిట్ను విస్తృతమైన డిజిటలైజేషన్, కస్టమర్ సముపార్జన మరియు సంపూర్ణ వృద్ధి యొక్క కొత్త యుగంలోకి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. లాభం మరియు నష్టం (పి&ఎల్) నిర్వహణ, డిజిటల్ కార్యక్రమాలు, సీనియర్ వాటాదారుల నిర్వహణ మరియు వ్యాపారాలను లాభదాయకత వైపు నడిపించడంలో అతని అపార అనుభవం టీవీఎస్ క్రెడిట్ యొక్క ఉజ్వల భవిష్యత్తు పథాన్ని రూపొందిస్తోంది. అతని మార్గదర్శకత్వంలో, సంస్థ మొత్తం ఆదాయం మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఎఫ్వై23లో 51% పెరిగింది. వర్క్ ప్లేస్ కల్చర్ అసెస్మెంట్లో 'గోల్డ్ స్టాండర్డ్' అయిన గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ సంస్థను 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' గా గుర్తించింది.
మాతో చేరడానికి ముందు, ఆశీష్ హౌసింగ్ ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎన్బిఎఫ్సి రంగాలలో ప్రముఖ కార్యకలాపాలను అందిస్తున్న బజాజ్ గ్రూప్లో 14 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. అతని ప్రొఫెషనల్ ప్రయాణంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు హెచ్ఎస్బిసి వద్ద విలువైన అనుభవాలు కూడా ఉన్నాయి. అతను ఐఎన్ఎస్ఇఎడి, ఫొంటైన్బ్లూ నుండి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేసారు.
1984 లో శ్రీ రాధాకృష్ణన్ ఈ గ్రూప్లో మేనేజ్మెంట్ ట్రైనీ గా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. 1984 నుండి 1995 వరకు ఈయన సుందరం-క్లేటన్ లిమిటెడ్ లో అనేక బాధ్యతలు నిర్వర్తించారు, ఆ సమయంలో బ్రేక్స్ డివిజన్ డెమింగ్ అప్లికేషన్ ప్రైజ్ మరియు జపాన్ క్వాలిటీ మెడల్ సంపాదించింది. ఆ తరువాత, 2000 వ సంవత్సరంలో శ్రీ రాధాకృష్ణన్ టీవీఎస్ మోటార్ కంపెనీ లో వ్యాపార ప్రణాళిక హెడ్ గా బాధ్యతలు స్వీకరించారు మరియు ఆగస్టు 2008 నుండి కంపెనీ యొక్కసిఇఒగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
శ్రీ బి. శ్రీరామ్ విశేషమైన అనుభవం కలిగిన వృత్తినిపుణుడు. ఈయన ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (గతంలో ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్) యొక్క సర్టిఫికెటెడ్ అసోసియేట్, మరియు న్యూఢిల్లీ లోని ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా & డిప్లోమసి నుండి ఇంటర్నేషనల్ లా & డిప్లోమసి లో డిప్లొమా పొందారు మరియు న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నుండి మేనేజ్మెంట్లో AIMA డిప్లొమా పొందారు. ఈయన ఒక హానర్స్ గ్రాడ్యుయేట్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం కింద ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉన్నారు.
తన కెరీర్లో భాగంగా శ్రీ శ్రీరామ్ జులై 2014 నుండి జూన్ 2018 వరకు ఐడిబిఐ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సహా వివిధ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన డిసెంబర్ 1981 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు మరియు క్రెడిట్ మరియు రిస్క్, రిటైల్, ఆపరేషన్స్, ఐటి, ట్రెజరీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో బ్యాంకు మరియు గ్రూపులో కీలక విధులు చేపట్టారు.
శ్రీ శ్రీరామ్ ప్రస్తుతం ICICI బ్యాంకు బోర్డులో స్వంతత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరియు బ్యాంకు యొక్క వివిధ కమిటీలలో సభ్యుడు/ ఛైర్మన్గా ఉన్నారు. ఈయన అనేక ఇతర కంపెనీల బోర్డులలో స్వతంత్ర డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. అదనంగా, ఈయన కొన్ని అడ్వైజరీ విధులు కూడా చేపట్టారు.
శ్రీ గోపాలన్ గొప్ప ప్రజ్ఞ మరియు నైపుణ్యం కలిగిన వ్యక్తి, భారతదేశంలో ఆర్థిక రంగ అభివృద్ధికి ఈయన విశేషంగా కృషి చేశారు. ఈయన తన వృత్తి జీవితంలో భాగంగా అనేక ప్రముఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ప్రస్తుతం ప్రధాన మంత్రి నియంత్రణలో ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పిఇఎస్బి) సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. పిఇఎస్బి వద్ద ఈ బాధ్యతను చేపట్టడానికి ముందు శ్రీ గోపాలన్ భారతదేశ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య వ్యవహారాల విభాగంలో సెక్రటరీగా జులై 2012 లో పదవీ విరమణ చేసే వరకు విధులు నిర్వర్తించారు. తన విధులలో భాగంగా జి-20 సమావేశాలు, ఎడిబి, ప్రపంచ బ్యాంకు, మరియు ఐఎంఎఫ్ సమావేశాలు సహా వివిధ అంతర్జాతీయ ఫోరమ్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.. ఈయన క్యాపిటల్ మార్కెట్ల నిర్వహణలో అనేక మార్పులు తీసుకువచ్చారు మరియు మౌలికవసతులలో కొత్త పాలసీ విధానాలను ప్రవేశపెట్టారు. వాణిజ్య వ్యవహారాల విభాగంలో సెక్రటరీగా విధులు చేపట్టే ముందు శ్రీ గోపాలన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఆర్థిక సేవల విభాగం యొక్క సెక్రటరీగా బాధ్యతను నిర్వర్తించారు, విధులలో భాగంగా ఈయన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ సంస్కరణలను పర్యవేక్షించారు. ఈ విధులలో భాగంగా, ఈయన పాలసీ మార్గనిర్దేశకాలు, చట్టపరమైన మరియు ఇతర పరిపాలన మార్పుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి లు), ఇన్సూరెన్స్ కంపెనీలు, మరియు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల (డిఎఫ్ఐలు) కు మద్దతును ఇచ్చారు, వాటి పనితీరును పర్యవేక్షించారు, మరియు ఎన్బిఎఫ్సిలు, ప్రైవేట్ బ్యాంకుల, మరియు విదేశీ బ్యాంకుల కోసం పాలసీలను రూపొందించారు. ఈయన పరిశ్రమ, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల మధ్య సమన్వయం చేశారు మరియు వాణిజ్య చర్చల కోసం డబ్ల్యుటిఒ యొక్క వివిధ మంత్రిత్వ సమావేశాలలో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీ గోపాలన్ బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయం కింద ఉన్న జాన్ ఎఫ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.
శ్రీమతి కల్పనా ఉనద్కత్ (55 సంవత్సరాలు) దశాబ్దానికి పైగా బోర్డ్ రూమ్ అనుభవం మరియు 25 సంవత్సరాల కంటే ఎక్కువ సరిహద్దు చట్టపరమైన మరియు పాలనా నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞురాలైన స్వతంత్ర డైరెక్టర్. శ్రీమతి కల్పనా ద్వంద-అర్హత కలిగిన సొలిసిటర్ (భారతదేశం మరియు యుకె) మరియు ఖైతాన్ అండ్ కో వద్ద సీనియర్ భాగస్వామి మరియు అషర్స్ట్స్ ఇండియా ప్రాక్టీస్ (లండన్) యొక్క మాజీ కో-హెడ్.
శ్రీమతి కల్పనా క్రాస్ బార్డర్ జాయింట్ వెంచర్లు మరియు ఎం&ఎలు (అంతర్జాతీయ మరియు దేశీయ), మరియు కార్పొరేట్ గవర్నెన్స్ చట్టాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు మరియు భారతదేశంలో వ్యాపారం చేయడం పై క్లయింట్లకు ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తున్నారు. పోటీ మార్కెట్లలో విజయం సాధిస్తూ డైనమిక్ వాతావరణాలలో విభిన్న బృందాలకు దిశానిర్దేశం చేయడంలో ఆమె అనుభవం కలిగి ఉన్నారు.
ఆమె ప్రస్తుతం అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ (డీమార్ట్), టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఎరిస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్ బోర్డులలో స్వతంత్ర డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ ఎం&ఎ లాయర్గా మరియు అషర్స్ట్ వద్ద భారతదేశం యొక్క మాజీ కో-హెడ్గా, కల్పన కార్పొరేట్ల అభివృద్ధి ప్రయాణాలలోని కీలకమైన దశలలో వారికి సహాయం అందించారు.
శ్రీమతి కల్పనా పాలనను వ్యూహాత్మక అమలుతో అనుసంధానించే సామర్థ్యం కోసం గుర్తింపు పొందారు, ఆమె స్థిరమైన దీర్ఘకాలిక విలువను సృష్టిస్తూ, సంస్థ యొక్క స్థితిస్థాపకతను బలోపేతం చేశారు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు మరియు ఆమె విమెన్ ఆన్ బోర్డ్స్ పై అనేక గవర్నెన్స్ వర్క్షాప్లు మరియు సహ-రచయిత పరిశోధనను అందించారు.
కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాల పై కల్పన విశేష గుర్తింపు పొందిన నిపుణురాలు. ఆమె బోర్డు ప్రభావం పై, ముఖ్యంగా కార్పొరేట్ గవర్నెన్స్, నాయకత్వం, సంస్థాగత వాతావరణం మరియు నిర్ణయం తీసుకోవడం వంటి అంశాల పై కూడా సలహాలు అందిస్తారు. ఆమె అనేక వర్క్షాప్లకు నాయకత్వం వహించారు మరియు డైరెక్టర్ అభివృద్ధి కోసం సమగ్ర విధానంతో 200 కంటే ఎక్కువ డైరెక్టర్లకు శిక్షణ ఇచ్చారు.
ఆమె క్రమం తప్పకుండా అంతర్జాతీయ కంపెనీల కోసం పనిచేస్తున్నారు మరియు స్వతంత్ర గైడ్లలో ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా గుర్తింపు పొందారు.
శ్రీమతి కల్పనా ట్రైల్బ్లేజర్, ఫిక్కీ ఫ్లో ద్వారా విమెన్ అచీవర్ అవార్డులు 2023, 2018 & 2019 లలో కార్పొరేట్ గవర్నెన్స్ లాయర్ ఫర్ ఇండియా మరియు కార్పొరేట్ గవర్నెన్స్ లాయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, ఎకనామిక్ టైమ్స్ మరియు స్పెన్సర్ స్టువర్ట్ ద్వారా 2019 లో రైజింగ్ విమెన్ ఆఫ్ ఇయర్ అవార్డుతో సహా వివిధ అవార్డులతో గుర్తించబడ్డారు మరియు గౌరవించబడ్డారు; ఫీమేల్ లాయర్ ఆఫ్ ది ఇయర్, విమెన్ ఇన్ లా అవార్డ్స్ మరియు 2017 సంవత్సరంలో విమెన్ సూపర్ అచీవర్ అవార్డ్.
జనవరి 2021 లో మిస్టర్ టి.సి. సుశీల్ కుమార్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు, దాదాపుగా నాలుగు దశాబ్దాల కెరీర్ను కలిగి ఉన్నారు. తన అవధి అంతటా, మిస్టర్ కుమార్ భారతదేశం మరియు విదేశాలలో మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జోనల్ మేనేజర్తో సహా ఎల్ఐసి లోపల వివిధ కీలక స్థానాలను కలిగి ఉన్నారు. అతను మార్కెటింగ్, సిఆర్ఎం, హెచ్ఆర్, ఫైనాన్స్, ఆడిట్, కార్పొరేట్ గవర్నెన్స్ మరియు పెట్టుబడులు వంటి ప్రధాన విభాగాలను నిర్వహించారు మరియు మారిషస్లో ఎల్ఐసి యొక్క విదేశీ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.
మిస్టర్ కుమార్ విశ్లేషణ మరియు వ్యూహాత్మక వ్యాపార ప్రణాళిక గురించి లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, ఇది మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయం మరియు మార్కెట్ నాయకత్వ వృద్ధిలో ఎల్ఐసి రికార్డ్-బ్రేకింగ్ మైలురాళ్లను సాధించడానికి సహాయపడింది. అతను మిలీనియల్స్ను లక్ష్యంగా చేసుకుని మార్కెట్ పరిశోధన కార్యక్రమాన్ని ప్రారంభించారు, దీని ఫలితంగా 2020-21లో 100,000 కొత్త ఏజెంట్లు వచ్చారు. అతను రియల్-టైమ్ ఆటోమేటెడ్ బిజినెస్ డేటా సంకలనం మరియు విశ్లేషణను, వ్యూహాత్మక నిర్ణయం-తీసుకోవడాన్ని మెరుగుపరచడాన్ని కూడా అమలు చేసారు.
ఎల్ఐసిలో తన పాత్రలకు అదనంగా, మిస్టర్ కుమార్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, లక్ష్మీ మెషీన్ వర్క్స్ మరియు నేషనల్ మ్యూచువల్ ఫండ్ (మారిషస్)తో సహా అనేక ప్రముఖ కంపెనీల బోర్డులలో సేవలు అందించారు. అతను ప్రస్తుతం మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ మరియు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ బోర్డులలో ఒక స్వతంత్ర డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
శ్రీ సంజీవ్ చద్దా బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క రిటైర్డ్ ఎండి మరియు సిఇఒ గా పని చేసారు. ఆయన నాయకత్వంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా సాంకేతికత-ఆధారిత, అత్యంత లాభదాయకమైన సంస్థగా మార్చబడింది, ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద బ్యాంక్గా మారింది.
ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ముందు, శ్రీ చద్దా ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ యొక్క ఎండి మరియు సిఇఒ గా పనిచేశారు. ఆయన ఎస్బిఐక్యాప్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క ఛైర్మన్గా కూడా పనిచేశారు, అక్కడ ఆయన స్వామి ఫండ్ని ప్రారంభించారు. అదనంగా, ఆయన ఎస్బిఐ యొక్క యుకె కార్యకలాపాలకు నాయకత్వం వహించారు మరియు దాని యుకె అనుబంధ సంస్థను విజయవంతంగా స్థాపించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 32-సంవత్సరాల కెరీర్లో, శ్రీ చద్దా కార్పొరేట్ క్రెడిట్లో సుదీర్ఘమైన అవధి పాటు సేవలు అందించారు మరియు అతని ఇతర అసైన్మెంట్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్కు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఉన్నారు; గ్రూప్ హెడ్, ఎం&ఎ మరియు కార్పొరేట్ అడ్వైజరీ, ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్స్ మరియు సిఇఒ, ఎస్బిఐ లాస్ ఏంజెల్స్.”
సైన్అప్ చేసి పొందండి తాజా అప్డేట్లు మరియు ఆఫర్లు